అభివృద్ధికి పట్టం కట్టండి :పైళ్ళ

నవ తెలంగాణ- భూదాన్:
 తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు  భూదాన్ పోచంపల్లి కేంద్రంలో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధిలైట్లు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు నియోజకవర్గంలో పోచంపల్లి మున్సిపాలిటీకి అధిక మొత్తంలో నిధులు కేటాయించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేశామన్నారు ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని పోచంపల్లి కేంద్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ఉంచడానికి సేవ చేసే అవకాశం కల్పించాలన్నారు కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, పట్టణ శాఖ అధ్యక్షులు సీత వెంకటేశం, పాటి సుధాకర్ రెడ్డి, చిలువేరు బాలనరసింహ, కౌన్సిలర్లు సామల మల్లారెడ్డి, పెద్దల చక్రపాణి, జినుకల యాదగిరి, వంగూరి పెంటయ్య, తడక రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love