బరువు తగ్గాలంటే…

సాధారణంగా బరువు తగ్గాలంటే పూర్తిగా తిండి మానేయాలనుకుంటారు చాలా మంది. రోజూ మనం తీసుకునే ఆహారాన్ని ఒక క్రమపద్ధతిలో తీసుకుంటే శరీరంలో కొవ్వును తేలికగా కరిగించు కోవచ్చు. రోజుకు మూడుసార్లు తినే ఆహారాన్ని అయిదు లేదా ఆరు భాగాలుగా విడగొట్టి కొంచెం కొంచెంగా తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు పరిశోధకులు.
– పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నట్లయితే జీర్ణ ప్రక్రియ నెమ్మదిగా జరిగేలా చేస్తుంది. దాని వల్ల చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. అందుకే భోజనం చేసిన ప్రతిసారి ఐదు గ్రాముల పీచు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణలు.-త పొట్టుతో సహా ఏవైనా చిరుధాన్యల్ని ఒక కప్పు అయినా తప్పనిసరిగా తినాలట. అలాగే ఒక కప్పుడు గింజలను తీసుకోవాలి. దీని వల్ల సుమారు ఐదు గ్రాముల పీచు పదార్ధం లభిస్తుంది. కాబట్టి వీటిని ఉదయం టిఫిన్‌ తినటానికి ముందు తినటం మంచిది.
– ఆపిల్‌, నారింజ, అరటిపండు, జామలలో ఏదో ఒకటి, పల్లీలు, క్యారెట్‌, కీర వంటివి మధ్యాహ్న ఆహారంలో చేర్చాలి. భోజనానికి ముందు క్యారెట్‌, కీరా భోజనం తర్వాత పండు తింటే సుమారు 4 గ్రాముల దాకా పీచుపదార్ధం లభించినట్టే. ముడి బియ్యంలో కూడా పీచుపదార్థం లభిస్తుంది. కాబట్టి తినగలిగే వాళ్ళు ముడిబియ్యం అన్నం తినటం మంచిది.
– ఆకుకూరలలో ఇనుము సమద్ధిగా లభిస్తుందని మనందరికి తెలుసు. ప్రపంచం మొత్తం మీద ‘రక్తహీనత’ భారతీయ స్త్రీలలోనే చాలా ఎక్కువ అని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ‘ఇనుము’ లోపం దీనికి ప్రధాన కారణం. అయితే ఈ సమస్య తీవ్రమై ఇతర దుష్పభావాలు జరిగే దాకా గుర్తించటం లేదని పేర్కొంటున్నారు.

Spread the love