నేడు ఈసెట్‌ కౌన్సెలింగ్‌లో మొదటి విడత సీట్ల కేటాయింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ద్వితీయ సంవత్సరంలో (లాటరల్‌ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో మంగళ వారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించనుంది. 12,876 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వారు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారు. సీట్ల కేటాయింపు, ఇతర వివరాలకు https://tsecet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Spread the love