- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తయిన సందర్బంగా నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి నార్సింగిలోని వారి నివాసంలో కలిసి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మహేష్ అన్న నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
- Advertisement -



