- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
రోడ్డు ప్రమాదాల నివారణకై ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని బాల్కొండ ఎస్ఐ శైలేందర్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి, వాహనం జప్తు చేస్తామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు కేవలం జరిమానాల కోసం కాదని, వాహనదారులు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకునే ముందస్తు చర్యలని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ట్రాఫిక్ రూల్స్ కఠినంగా అమలు చేస్తామని వివరించారు.
- Advertisement -



