విషాదం.. ఇంటి పైకప్పు కూలి నిద్రలోనే ముగ్గురు మృతి

నవతెలంగాన- పంజాబ్: భారీ వర్షాలు ఉత్తరాది రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఢిల్లీ, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వర్షాలవల్ల పంజాబ్‌ లోని  ఫరీద్‌కోట్‌ పట్టణంలోని కోట్కపుర ఏరియాలో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం 4 గంటలకు ఓ ఇంటి పైకప్పు కుప్పకూలడంతో ఆ కుటుంబంలోని ముగ్గురు నిద్రలోనే కన్నుమూశారు. పూర్వకాలం నాటి మట్టిమిద్దె వర్షాలకు బాగా నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో ఆ ఇంటి యజమాని, కడుపుతో ఉన్న ఆయన భార్య, వారి మూడేళ్ల కొడుకు దుర్మరణం పాలయ్యారు. వారి ఇంట్లో పడుకునేందుకు వచ్చిన పొరుగింటి అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి.

Spread the love