నవతెలంగాణ-హైదరాబాద్ : మూడో దశ లోక్సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో ఎన్నికల విధుల్లో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారు. వీరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుండగా, మరొకరు వ్యవసాయ శాఖకు చెందిన వారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు గుండెపోటుతో మరణించారని ఎన్నికల కమిషన్ వర్గాలు మంగళవారం తెలిపాయి. మృతుల్లో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న 48 ఏళ్ల గోవిందప్ప సిద్దాపూర్గా గుర్తించారు. సోమవారం బాగల్కోట్ జిల్లా ముధోల్ పట్టణంలో తుదిశ్వాస విడిచారు. మృతుల్లో రెండో వ్యక్తి బీదర్ జిల్లా కుదుంబల్కు చెందిన అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆనంద్ తెలంగ్ (32)గా గుర్తించారు.