నవతెలంగాణ-మేడిపల్లి
మేడిపల్లి మండల కేంద్రంతో పాటు, పోరుమల్ల, కట్లకుంట, వెంకటరావుపేట గ్రామాల్లో చాకలి ఐలమ్మ జయంతి మంగళవారం నిర్వహి ంచారు. రాజన్న సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ హాజరై చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రమేష్రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఉరుమల లక్ష్మణ్, చేపూరి నాగరాజు, నల్ల భూమారెడ్డి, గంగాధర్, మార్గం నరసారెడ్డి, దాసరి శంకర్, శ్రీ పతిదామోదర్, గడ్డం జలంధర్రెడ్డి, గడ్డం శ్రీనివాస్రెడ్డి, మాదం వినోద్, చెలిమెల గంగాధర్, రజక సంఘం అధ్యక్షుడు వేములవాడ నారాయణ, గంగరాజం, భీమరాజం, శేఖర్, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.
కోరుట్ల : పట్టణంలోని చాక ఐలమ్మ విగ్రహానికి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు పూలమాల వేసి నివాళలర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
జగిత్యాలటౌన్ : జగిత్యాల జిల్లా కేంద్రంలోని చింతకుంట వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజరుకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ చైర్మెన్ గోలీ శ్రీనివాస్, కౌన్సిలర్ బాలే లత శంకర్, పంబాల రామ్ కుమార్, పద్మావతి పవన్, శివ కేసరి బాబు, కప్పల శ్రీకాంత్, నాయకులు సమిండ్ల శ్రీనివాస్, హరి అశోక్ కుమార్, పాల్గొన్నారు.
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ చిత్ర పటానికి ఎస్సీ ఎగ్గడి భాస్కర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, ఏవో అమర్నాథ్, ఆర్.ఐలు జానీమియా, వేణు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
మెట్పల్లి :మెట్పల్లి పట్టణంలోని ఆమె విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్, తెలంగాణ జనసమితి కోరుట్ల నియోజకవర్గ ఇన్ చార్జి కంతి మోహన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు, కలిగొట శ్రీకాంత్, బండలింగాపుర్ శ్రీకాంత్, కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్,బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్, జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి తిరుమల వాసు, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనికెల నవీన్, రాష్ట్ర ఎస్సీ మోర్చ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ఇందిరా గాంధీచౌక్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు నేమూరి లత పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నేమూరి సత్య నారా యణ, నేరెళ్ల శ్రీనివాస్, రాజేందర్, శ్రీనివాస్, రమేష్, పాల్గొన్నారు
జగిత్యాల:జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సంజరుకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ… చాకలి ఐలమ్మ పేద వర్గాల ప్రజల కోసం చేశారని కొనియడారు. ఈ కార్యక్రమంలో వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి సాయి బాబా, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి జనార్ధన్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్. భీమ్కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి హన్మం తురావు, సీనియర్ సిటిజన్ హరిఅశోక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.