రామోజీరావుకు ఘన నివాళి..

నవతెలంగాణ – గోవిందరావుపేట
ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల కమ్మ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘన నివాళి అర్పించారు. మండల కేంద్రంలోని కమ్మ సంఘం కళ్యాణమండపంలో మండల కమ్మ సంఘం అధ్యక్షుడు పాలడుగు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో తెలంగాణ కమ్మ సంఘం అధ్యక్షుడు మరియు ఎమ్మెల్యే అయిన అరికెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రామోజీ రామ్ సేవలు చిరస్మరణీయమని , వెలకట్ట లేని వని అన్నారు. ఈ కార్యక్రమంలో  కమ్మ సంఘం మండల కమిటీ సభ్యులు గౌరవ సభ్యులు గౌరవ అధ్యక్షులు పాల్గొన్నారు.

Spread the love