నవతెలంగాణ-హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ 2024 దరఖాస్తుల గడువు పొడిగించినట్లు కన్వీనర్ రాజేశ్ కుమార్ ప్రకటించారు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా మే 25వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రతి ఏడాది టీఎస్ పీఈసెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డీపీఎడ్లో ప్రవేశాల కోసం ఇంటర్ పూర్తయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిగ్రీ పూర్తయిన విద్యార్థులతో పాటు ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. జూన్ 10 నుంచి 13వ తేదీ మధ్యలో టీఎస్ పీఈసెట్ రాతపరీక్షలను నిర్వహించనున్నారు.