– రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య
నవతెలంగాణ-ఆసిఫాబాద్
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఖాళీలను భర్తీ చేసి, అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్స్ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన పాఠశాలలు ఏర్పాటు చేస్తామనడం స్వాగతించదగ్గదే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న బడుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెరగాలంటే పాఠశాలలో నమోదు కోసం ఇప్పటినుండే ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షులు శాంతి కుమారి, ప్రధాన కార్యదర్శి ఇందురావ్, ఉపాధ్యక్షుడు హేమంత్ షిండే, కోశాధికారి రమేశ్, నాయకులు తిరుపతి, బాదిరావు, అన్నపూర్ణ, రాజేష్, కిరణ్ ఉన్నారు.