పాలేరు ప్రజా ఆశీర్వాద సభకు వస్తూ…ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

నవతెలంగాణ కూసుమంచి: సీఎం కేసీఆర్‌ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పాలేరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ జరుగుతుంది. ఈ సభకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించారు. అలా వస్తున్న ఒక ట్రాక్టర్ కూసుమంచి మండలం జిళ్ళచెరువు వద్ద బోల్తా పడింది. దీంతో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయాపడిన వారిని ఆస్పత్రి తరలించారు. వీరి పరిస్థితి సైతం విషమంగా ఉందని తెలుస్తోంది. వీరంతా కూసుమంచి మండలంగైగుల్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

Spread the love