నవతెలంగాణ – హైదరాబాద్: రెండు రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మే 12న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. మే 15 వరకు వాతావరణం కాస్త చల్లగానే ఉంటుందని, మే 20 తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.