సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

నవతెలంగాణ – ఢీల్లి: సుప్రీంకోర్టుకు కొత్తగా నియమితులైన ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేయించారు. సుప్రీంకోర్టు సంఖ్యాబలం 34 కాగా, కొత్తగా ఇద్దరు న్యాయమూర్తుల రాకతో  జడ్జీల సంఖ్య 32కు చేరింది. మరో రెండు ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ భుయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసిన వెంకటనారాయణకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం సిఫారసు చేసింది. వీరి పదోన్నతికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Spread the love