కామెర్ల భారిన మరో ఇద్దరు..

– చికిత్సకు కరీంనగర్ ప్రయివేట్ ఆస్పత్రికి..
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో గ్రామస్తులు కామెర్ల వ్యాది భారిన పడుతూనే ఉన్నారు. మంగళవారం గ్రామానికి చెందిన మామిడాల రాజు గౌతమి దంపతులు ఆనారోగ్యానికి గురవ్వగా చికిత్స కోసం మండల కేంద్రంలోని ప్రయివేట్ ఆస్పత్రి వేళ్లారు.వైద్యుడు వెంటనే బాధితులను కరీంనగర్ ఆస్పత్రికి వేళ్లాలని సూచించారు.కరీంనగర్ ప్రయివేట్ ఆస్పత్రికి వేళ్లి పరీక్షలు నిర్వహించుకోవడంతో ఇరువురికి కామెర్ల వ్యాదిగా వైద్యలు నిర్దారించారని బాధితులు తెలిపారు.గ్రామంలో కామెర్ల వ్యాదితో నూతన కేసులేమి నమోదవ్వలేదని వైద్యాధికారులు తెలిపిన 24 గంటల్లోనే దంపతులిద్దరూ వ్యాది భారిన పడడం గమనార్హం.గ్రామస్తులు కామెర్ల వ్యాదిన భారిన పడుతుండడంతో అందోళన వ్యక్తం చేస్తున్నారు.బేగంపేట గ్రామంలో జిల్లా వైద్యాధికారి క్షేత్రస్థాయిలో పర్యటించి కామెర్ల వ్యాదికి గల కారణాలపై విచారణ చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
Spread the love