ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

Road-Accidentన‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని వ్యాన్‌ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన వాజేడు మండలం జగన్నాథపురం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు సీఆర్పీఎఫ్‌ జవాన్‌ తిరుమల్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love