సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్

నవతెలంగాణ – తమిళనాడు: తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం దక్కలేదని ఆయన ఆరోపించారు. ప్రెసిడెంట్ ముర్ము గిరిజన మహిళ కావడం, ఆమె భర్త చనిపోవడమే దీనికి కారణమన్న ఆయన, సనాతన ధర్మం అంటే ఇదేనని మండిపడ్డారు. రూ.800 కోట్ల ఖర్చుతో కట్టిన నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి తొలి పౌరురాలైన రాష్ట్రపతికి ఆహ్వానం దక్కలేదని ఉదయనిధి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టిన సమయంలో హిందీ నటీమణులనూ ఆహ్వానించారని చెప్పారు. కానీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం వ్యక్తిగత కారణాల పేరిట దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పారు. సనాతన ధర్మం ప్రభావానికి ఇలాంటి ఘటనలు సూచికలని చెప్పుకొచ్చారు. గతంలో తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘జనాలు నా తలపై ఓ రెట్టు కట్టారు. కానీ నేను అలాంటి వాటిల్ని పట్టించుకోను. సతాతన ధర్మాన్ని నిర్మూలించేందుకే డీఎంకే పుట్టింది.

Spread the love