యువతిని కొడుతూ నగ్నంగా ఊరేగించిన భర్త అత్తమామలు ..

నవతెవలంగాణ – రాజస్థాన్: రాజస్థాన్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. వివారలోకి వేత్తే.. ప్రతాప్‌ఘడ్ జిల్లాలో గురువారం ఈ దారుణం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా మారింది. సాయం చేయాలని బాధితురాలు వీధుల్లోని వారిని వేడుకుంటుండగా ఆమెపై భర్త కర్కశంసగా ప్రవర్తించాడు.  మరో వ్యక్తితో ఉంటున్న ఆమెను భర్త, అత్తమామలు కిడ్నాప్ చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇష్టారీతిన చేయిచేసుకుని ఆపై నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని రాజస్థాన్ డీజీపీ తెలిపారు. మరికొన్ని గంటల్లో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ అమానవీయ ఘటనను ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. పౌర సమాజంలో ఇటువంటి నేరగాళ్లకు స్థానం లేదని వ్యాఖ్యానించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరిపిస్తామని, నిందితులను వీలైనంత త్వరగా కటకటాల్లోకి తోస్తామని ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.

Spread the love