ఉప్లూర్ రైతుకు ఉత్తమ రైతుగా సన్మానం

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం ఆర్మూర్ లో వ్యవసాయ దినోత్సవం సందర్భంగా పలువురుని ఉత్తమ రైతుల అవార్డుతో సన్మానించారు.మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన బద్దం తిరుపతిరెడ్డిని కూడా ఉత్తమ రైతుగా ఎంపిక చేసి ఆర్మూర్ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డిని లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ అధ్యక్షులు గంగా ప్రకాష్, కోశాధికారి అల్జాపూర్ రాజేష్, క్యాషియర్ కుంటాల నరేందర్ శాలువాతో  సత్కరించి మెమొంటో అందజేశారు. వ్యవసాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ రైతుల ఎంపిక చేసి  సత్కరించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. లైన్స్ క్లబ్ ఆఫ్ గ్రీన్ ఆర్మూర్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love