ఉపాధ్యాయులను సన్మానించిన గ్రామ అభివృద్ధి  కమిటీ..

నవతెలంగాణ- జక్రాన్ పల్లి 
మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్  జయంతి పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మండలంలోని  తొర్లికొండ ప్రాథమిక. ఉన్నత.సంతోష్ నగర్.పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను మంగళవారం స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మ.ఉప సర్పంచ్ భూమేశ్వర్. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జీవన్.ఉపాధ్యక్షులు కార్యదర్శి.కోశాధికారి జానకిరామ్. సభ్యులు పాల్గొన్నారు సన్మానం పొందిన వారిలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రేణుక. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు   జంగం అశోక్. రామకృష్ణ.హరి జీవన్.పి గంగాధర్. జె సుందర్. సంకేపల్లి గంగాధర్. డి రాజేందర్. సునీత.లక్ష్మీ నరసింహారావు.ఇతర ఉపాధ్యాయులు ఉన్నారు.
Spread the love