కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వినోద్ కుమార్ గెలుపు ఖాయం

– బీఆర్ఎస్ మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ 

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన బోయిన్ పల్లి వినోద్ కుమార్ పార్లమెంట్ మెంబర్ గా గెలవడం ఖాయమని బీ అర్ ఎస్ పార్టీ మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమలు కానీ హామీలతో ప్రజలను మోసగించి కాంగ్రెస్ గద్దె నిక్కిందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి పార్లమెంటు ఎలక్షన్లో ఓట్లు అడగాలన్నారు. రైతులు పండించిన  వడ్లకు రూ .500 బోనస్ ఈ సీజన్ లోనే చెల్లించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మహిళలకు ప్రతినెల మహాలక్ష్మి పథకం రూ .2500 వందలు చెల్లించాలన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బోయిన్ పల్లి వినోద్ కుమార్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు  చేపట్టారన్నారు. ప్రజలు బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి వినోద్ కుమార్ ను గెలిపిస్తారని అన్నారు.
Spread the love