విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అప్పుల బాధ తాళలేక సైనైడ్‌ తాగి వీరంతా బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం కొంతకాలంగా అనకాపల్లిలో నివసిస్తోంది. గురువారం రాత్రి వీరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో శివరామకృష్ణ(40), మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16), లక్ష్మి(13) మృతి చెందగా.. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రిలో మరో కుమార్తె కుసుమప్రియ(13) చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Spread the love