Monday, July 20, 2026
E-PAPER
Homeజిల్లాలు'ఉపాధి' ఉద్యోగుల వేతన వెతలు

‘ఉపాధి’ ఉద్యోగుల వేతన వెతలు

- Advertisement -

– మూడు నెలలుగా విడుదల కాని వేతనాలు
– ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు

నవతెలంగాణ-మల్హర్ రావు

గ్రామాల్లోని పేదలకు ఉపాధి పథకం (‘వీబీ జీరామ్ జీ) కింద పని కల్పించడంలో సిబ్బందే కీలక పాత్ర పోషిస్తారు. జాబ్ కార్డు కలిగిన కూలీలు వివిధ పనులు చేపట్టి ఉపాధి పొందుతున్నారు. ఈ పథకం సజావుగా కొనసాగేందుకు వివిధ స్థాయిలలో సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాంటి సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో వీబీ-జీ రామ్ జీ పథకంలో మండల వ్యాప్తంగా 17 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారిలో ఒక ఏపీవో, ఒక ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, 11మంది ఫీల్డ్ అసిస్టెంట్లు కీలక ప్రాత పోషిస్తున్నారు. వీరు కూలీలకు పనులను కేటాయించడం, ఆన్ లైన్ వివరాలు నమెదు చేయడం, వేతనాలు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడడం వంటి బాధ్యతలను నిర్వరిస్తారు.
ప్రతి నిత్యం ఈ పథకం సజావుగా సాగేందుకు నిరంతరం పనిచేస్తున్న వీరికి వేతన బకాయిలతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు (ఏప్రిల్, మే, జూన్) పెండింగ్లో ఉన్నాయి. జులై చివరి వారానికి వచ్చినా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పెండింగ్ వేతనాలను విడుదల చేసి, సకాలంలో అందించాలని ‘ఉపాధి’ సిబ్బంది కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -