నవతెలంగాణ- కమ్మర్ పల్లి: వేంపల్లి గ్రామ సర్పంచ్ జక్క మల్లు బాయి గంగాధర్, గ్రామ అధ్యక్షులు మల్లారి గంగాధర్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ 8వ వార్డు సభ్యుడు మమ్మాయి గంగాధర్, 2వ వార్డు సభ్యుడు లావణ్య రాజేశ్వర్, ముప్కాల్ మండలం ఎస్టీ సంఘం ప్రధాన కార్యదర్శి సంగెం గంగారాం తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. ఘర్ వాపసిలో భాగంగా పార్టీలోకి తిరిగి వచ్చిన నాయకులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు డైరెక్టర్ ఆకుల రాములు, లక్ష్మణ్ యాదవ్ యూత్ సభ్యులు, పిప్పెర గణేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.