నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల

Sagarనవతెలంగాణ – హైదరాబాద్
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ దగ్గర బుధవారం నుంచి ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నీటి విషయంలో ఏపీ, తెలంగాణ పోలీసుల్ని భారీగా మోహరించారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. అయితే ఏపీ పంతం నెగ్గించుకుంది. నాగార్జున సాగర్ నుంచి ఏపీకి నీరు విడుదలయ్యాయి. సాగర్ ప్రాజెక్ట కుడి కాలువకు నీటిని ఒంగోలు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో 2వేల క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. నాగార్జున సాగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ ఎపిసోడ్‌పై సీపీఐ నేతలు స్పందించారు. తెలుగు ప్రజానీకానికి ద్రోహం చేసే పద్దతుల్లోనే అటు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, బీజేపీ కలిసి ఆడే డ్రామాగా వ్యాఖ్యానించారు. సీపీ. నాగార్జునసాగర్‌లో పోలీసుల మోహరింపు.. ఎన్నో ఏళ్లగా రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉంది.. పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలోనే తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుయుక్తులు, కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణ, ఏపీ, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతుంటే.. తెలుగు ప్రజలు బలి అవుతున్నారు.. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ , కేసీఆర్ కొత్త కుట్రకు తెరలేపారన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించటం వెనక ఎన్నికల లబ్ధి ఉందని విమర్శించారు. పట్టిసీమలో నీళ్లు ఉన్నా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి మనస్కరించటం లేదని.. తెలంగాణలో సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందేందుకే ఈరోజు నాగార్జునసాగర్ వద్ద హైడ్రామా అన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆరోపించారు. నీటి సమస్యను ఇరు తెలుగు రాష్ట్రాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

Spread the love