దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం

నవతెలంగాణ- దుబ్బాక రూరల్: దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని పద్మనాభినిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కండ్లకోయ సత్యనారాయణ, బూత్ ఇంచార్జ్ కండ్ల కోయ కర్ణకర్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా  చెఱకు శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు దుబ్బాక తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుబ్బాక గడ్డ కాంగ్రెస్ కంచుకోట అని తెలిపారు. చెఱకు శ్రీనివాస్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపిస్తామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య, భూత అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కండ్లకోయ కర్ణాకర్, కార్యకర్తలు హరీష్, లచ్చయ్య ,యాదగిరి తదితరులున్నారు
Spread the love