ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్న విండీస్ సంచలన పేసర్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్ లో 7 వికెట్లతో సంచలన ప్రదర్శన కనబర్చి, వెస్టిండీస్ జట్టుకు 21 ఏళ్ల తర్వాత చారిత్రాత్మక విజయాన్ని అందించిన యువ ఫాస్ట్ బౌలర్ షామార్ జోసెఫ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఇంగ్లండ్ బౌలర్ మార్క్ ఉడ్ స్థానంలో షామార్ జోసెఫ్ ను కొనుగోలు చేసింది. షామార్ జోసెఫ్ కు రూ.3 కోట్లు చెల్లించాలని లక్నో నిర్ణయించింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Spread the love