యశస్విని ఝాన్సీ రెడ్డి గెలుపు ఖాయం..

 – కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్
నవతెలంగాణ- పెద్దవంగర: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ అభ్యర్థి మామిండ్ల యశస్విని ఝాన్సీ రెడ్డి గెలుపు ఖాయమని ఆ పార్టీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, యూత్ మండల ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్ అన్నారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని చిట్యాల గ్రామంలో వినూత్నంగా యశస్విని ఝాన్సీ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ దీపాలు వెలిగించి, ఆమెపై అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసిన యశస్విని ఝాన్సీ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాబోతుందన్నారు. కార్యకర్తలు ఈ పదిహేను రోజులు కష్టపడితే విజయం సొంతమవుతుందన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ను గెలిపించుకోవడానికి కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలన్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలకు బీఆర్‌ఎస్‌ చేసింది శూన్యమన్నారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు పాక శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు మొగలగాని రజినీకాంత్, వార్డు సభ్యులు ఆకుతోట వెంకన్న, వల్లపు కుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ నారబోయిన రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love