జీ మీడియా సీఈవో అభయ్‌కు ఉద్వాసన

న్యూఢిల్లీ: జీ మీడియా కార్పొరేషన్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా ఉన్న అభయ్‌ ఓజాను ఆ సంస్థ అనుహ్యాంగా తొలగించింది. మే4న జరిగిన బోర్డు ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జీ మీడియా సోమవారం రెగ్యూలేటరీ సంస్థలకు తెలిపింది. కాగా.. అభయ్‌ తొలగింపునకు కారణాలను వెల్లడించలేదు. 2022లో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా చేరిన ఓజా.. గతేడాది సిఇఒగా బాధ్యతలు స్వీకరించారు.

Spread the love