సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జడ్పీ ఛైర్ పర్సన్

 

నవతెలంగాణ – మహబూబ్ నగర్ : కాంగ్రేస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటుంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.  స్వర్ణ సుధాకర్ రెడ్డి తో పాటు, దేవరకద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొండ శ్రీనివాస్ రెడ్డి తదితరులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సీఎం ఇంటికి చేరుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వర్ణ సుధాకర్ రెడ్డి, కొండ శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీడబ్ల్యుసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Spread the love