దుబ్బాక ఎమ్మెల్యే కు జెడ్పీటీసీ శుభాకాంక్షలు

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
దుబ్బాక ఎమ్మెల్యే కు జెడ్పీటీసీ శుభాకాంక్షలు తెలిపారు.2023 ఎన్నికల్లో తన ప్రత్యర్థులపై దుబ్బాకలో భారీ మెజార్టీ సాధించిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని శుక్రవారం పోతారం గ్రామంలో దుబ్బాక జెడ్పీటీసీ కడతాల రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు కిషన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్యే కి జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, కిషన్ రెడ్డి బొకే ఇచ్చి శాలువాతో సత్కరించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డితోనే దుబ్బాక అభివృద్ధి సాధ్యమని వారు తెలిపారు.
Spread the love