ఓటు హక్కును వినియోగించుకున్న జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం  

నవతెలంగాణ –  చండూరు 
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో  చండూరు జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం  సోమవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో  ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతో ప్రజలకు సేవ చేసే తనకు నచ్చిన నాయకుడిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు వేయాలని కోరారు.
Spread the love