Wednesday, August 12, 2026
E-PAPER
HomeNewsలారీని ఢీకొట్టిన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు..30 మందికి గాయాలు

లారీని ఢీకొట్టిన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు..30 మందికి గాయాలు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని హైదరాబాద్‌ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 30 మంది గాయపడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న జంగారెడ్డిగూడెం లక్కవరం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్యాబిల్లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీశారు. క్షతగాత్రులను  జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -