- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : విజయవాడలో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. కృష్ణా లంక పోలీసులకు అందిన సమాచారం మేరకు, ఓ ప్రయాణికుడి బ్యాగ్లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమై, సీసీ కెమెరాల ద్వారా ప్రయాణికుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి చేరవేయాలనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
- Advertisement -



