ఈనెల 12 వరకే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 12 వరకే కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆదివారం, మంగళవారాల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 6న ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. అదే రోజు బీఏసీ సమావేశమవుతుంది. 9 నుంచి పద్దులపై చర్చ కొనసాగనుంది. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ, మండలి ఆమోదం తెలపనున్నాయి.

Spread the love