టెన్త్‌ ఫీజు గడువు 15 వరకు పొడిగింపు

– ఆలస్య రుసుం రూ.వెయ్యితో చెల్లించే అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈ ఏడాది ఏప్రిల్‌ మూడు నుంచి 13వ తేదీ వరకు నిర్వహించే పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజు చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం తత్కాల్‌ స్కీం కింద అవకాశం కల్పించింది. ఈ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్య రుసుం రూ.వెయ్యితో ఈనెల 15వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని తెలిపారు. ఇతర సమాచారం కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరారు.

Spread the love