కౌoట్ డౌన్.. ప్రచారానికి మిగిలింది మూడు రోజులే..!

– క్యాంపియన్ జోరు పెంచిన ప్రధాన పార్టీలు
నవతెలంగాణ – మల్హర్ రావు
సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి గడువు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలింది.పోలింగ్ కు 48 గంటల ముందే అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.దీంతో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 11న సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు.తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను కలిసేలా తమ ప్రచారం తీరును మార్చుకుంటున్నారు.ఇన్నాళ్లు నాయకులు,కార్యకర్తలు,సమావేశాలు,సభలు నిర్వహించిన ప్రధాన పార్టీలు ఇప్పుడు ప్రధాన పట్టణాలు,మండల కేంద్రాల్లో కార్నర్ మిగింగ్, రోడ్ షోలను నిర్వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటా ప్రచారం నిర్వహించేందుకు లోకసభ ఎన్నికల్లో విలుపడదు.పెద్దపల్లి లోకసభ నియోజవర్గ పరిధిలో ప్రధాన పార్టీల ప్రచారం విస్తృతంగా ఉండడంతోపాటు ఏడూ అసెంబ్లీ సెగమెంట్లు ఉన్నాయి.దీంతో తక్కువ సమయంలో ఎక్కువ మందితో మమేకం అయ్యేలా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.మండల స్థాయి,గ్రామస్థాయి నాయకులు,కార్యకర్తలు ఉదయాన్నే చెరువుల్లో పనులకు వెళుతున్న ఉపాధిహామీ కూలీల వద్దకు చేరుకొని తమ అభ్యర్థికి ఓటు వేయాలని కూలీలకు చల్లా ప్యాకెట్లు, మంచినీళ్లు,అరటి పండ్లు పంపిణీ చేస్తూ ఓటు వేయాలని అభ్యర్దిస్తున్నారు.
Spread the love