విద్యుత్ షాక్ తో ట్రాక్టర్ డ్రైవర్ మృతి 

– రుద్రారంలో ఘటన…కేసు నమోదు చేసిన పోలీసులు
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు విద్యుత్గతానికి గురై ధోనిపెళ్లి హరికృష్ణ (27) అనే ట్రాక్టర్ డ్రైవర్  మరణించిన సంఘటన మండలంలోని రుద్రారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.కొయ్యుర్ పోలీసులు, స్థానికుల పూర్తి కథనం ప్రకారం చిన్న కాళేశ్వరం అభివృద్ధి పనుల్లో బాగంగా రుద్రారం గ్రామ ఉర చెరువుకు మూడేళ్ళ క్రితం పడిన గండి తోపాటు చెరువు కట్ట మరమ్మతుల పనులు ఇటీవల చేపట్టారు.కట్టపై పోసిన మట్టిపై నీళ్లు పోసేందుకు వాటర్ ట్యాoకర్ ద్వారా ఓ రైతుకు చెందిన బోర్ మోటార్ వద్ద నుంచి నీటిని తెస్తున్న  క్రమంలో ట్యాoకర్ మూత పెట్టకపోవడంతో నీరు డొల్లి పోతున్నదని ట్యాoకర్ డ్రైవర్  హరికృష్ణతో ట్యాoకర్ మూత  వేస్తున్న క్రమంలో ప్రమాదకరంగా కిందికి ఉన్న 11 కెవి విద్యుత్ తీగలకు అతని చేతులు తగలడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో అక్కడికక్కడే హరికృష్ణ మృతి చెందినట్లుగా తెలిపారు.కాగా మృతుని స్వగ్రామం  కరీంనగర్ జిల్లా మారేడు పెళ్ళికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.మృతుని తండ్రి రామయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తెలిపారు.
Spread the love