రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – మల్హర్ రావు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రమైన గాయాలైన సంఘటన మండలంలోని కొయ్యుర్-కాటారం ప్రధాన రహదారిపై గురువారం చోటుచేసుకుంది. స్థానికుల పూర్తి కథనం ప్రకారం కాటారం నుంచి కారు మంథనికి వెళుతుండగా మంథని నుంచి భూపాలపల్లి వైపునకు వస్తున్న లారీ కొయ్యుర్ రొడ్డాం సమీపంలో లారీ కారును ఢీకొట్టింది. కారు ముందుబాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ రాజు కాలు, దవడ భాగాలకు తీవ్రమైన గాయలైయ్యాయి. సంఘటన స్థలానికి కొయ్యుర్ పోలీసులు చేరుకొని చికిత్స నిమిత్తం రాజును భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విచారణ అనంతరం కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ తెలిపారు.
Spread the love