గుండెపోటుతో ఉపాధి హామీ కూలి హఠాత్ మరణం

నవతెలంగాణ – ధర్మసాగర్ 
గుండెపోటుతో ఉపాధి హామీ కూలి హఠాత్తుగా మరణించిన  ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రాపాకపల్లి గ్రామానికి చెందిన ఇమ్మడి గట్ట స్వామి (50) బుధవారం యాద విధిగా వందరోజుల ఉపాధి హామీ పథకం పనికి వెళ్లడం జరుగుతుందని, ఈ క్రమంలో పనిచేసే ప్రదేశంలో గుండె నొప్పితో బాధపడకుండా తోటి కూలీలు ఉపాధి హామీ సిబ్బంది హుటాహుటిన 108 కాల్ చేసి రమ్మనడం జరిగిందని తెలిపారు. సిబ్బంది, కూలీలు ఆయనకు  సి ఆర్ పి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని  తెలిపారు. విధులు నిర్వహిస్తూ హఠాత్ మరణం పొందిన గట్ట స్వామికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఈ సందర్భంగా తోటి ఉపాధి కూలీలు గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన స్థానిక ఎంపీడీవో అనిల్ కుమార్ ఉపాధి హామీ సిబ్బందిని తోటి కూలీలను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఓ సంపత్, జె ఈ శ్రీనివాస్, టీ ఏ కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, మేటి ప్రసన్నకుమారి, పంచాయతీ కార్యదర్శులు ఆకారపు సురేష్, మల్లేశం, సుధాకర్, గ్రామ పెద్దలు వినోద్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love