నవతెలంగాణ-సిటీబ్యూరో
నవతెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి పొన్న నగేష్ తండ్రి పొన్న లక్ష్మయ్య అనారోగ్యంతో శుక్రవారం మృతిచెందారు. ఆయన మృతికి నవతెలంగాణ సీజీఎం ప్రభాకర్, ఎడిటర్ సుధా భాస్కర్ సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగం పల్లిలో లక్ష్మయ్య భౌతికకాయాన్ని నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి, జనరల్ మేనేజర్లు పి.నరేందర్రెడ్డి, రఘు, ఆర్.వాసు, మేనేజర్లు వీరయ్య, రేణుక, ఉపేందర్రెడ్డి, గురుదీప్ సందర్శించి నివాళలర్పించారు. ఆయన అంత్యక్రియలు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలోని చెరువు అన్నారం గ్రామంలో శనివారం జరగనున్నాయి. లక్ష్మయ్య మృతికి హైదరాబాద్ జిందాబాద్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది.