బెంగాల్‌ 174 ఆలౌట్‌

–  సౌరాష్ట్రతో రంజీ ఫైనల్‌
కోల్‌కత : సౌరాష్ట్ర పేసర్లు జైదేవ్‌ ఉనద్కత్‌ (3/44), చేతన్‌ సకారియ (3/33) నిప్పులు చెరగటంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్‌ అహ్మద్‌ (69), అభిషేక్‌ పోరెల్‌ (50) అర్థ సెంచరీలతో 6/65తో ఉన్న బెంగాల్‌ను ఆదుకున్నారు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 81/2తో ఆడుతోంది. గోహిల్‌ (6), విశ్వరాజ్‌ (25) విఫలమయ్యారు. ప్రస్తుతం సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 93 పరుగుల వెనుకంజలో నిలిచింది.

Spread the love