1,159 స్పెషలిస్టులకు పోస్టింగ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 25 జిల్లాల్లో ఉన్న 26 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ఆస్పత్రుల్లో 1,159 స్పెషలిస్ట్‌ వైద్యులకు కంపల్సరీ గవర్నమెంట్‌ సర్వీస్‌ కింద, ఏడాది కాలం పాటు పోస్టింగ్‌ ఇస్తూ రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్య పూర్తి చేసిన వారు తప్పని సరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది కాలం పాటు పని చేయాల్సి ఉంటుంది. జనరల్‌ సర్జరీ, జనరల్‌ మెడిసిన్‌, ఆర్థో, గైనిక్‌, ఈఎన్‌టీ, అనస్థీషియా సహా మొత్తం 24 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు వీరి ద్వారా ప్రజలకు అందించబోతున్నారు. స్పెషాలిటీ వైద్యులకు నెలకు రూ. 92,575 స్టైఫండ్‌గా ప్రభుత్వం చెల్లిస్తున్నది.

Spread the love