విజేతకు రూ.13.23 కోట్లు

– రన్నరప్‌కు రూ.6.61 కోట్లు
– ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్రైజ్‌మనీ
దుబారు : ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ విజేత రూ.13.23 కోట్లు అందుకోనుంది. రన్నరప్‌కు రూ.6.61 కోట్లు దక్కనున్నాయి. ఈ మేరకు ఐసీసీ శుక్రవారం ప్రైజ్‌మనీ వివరాలు వెల్లడించింది. తొలి డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ యథావిధిగా కొనసాగించిన ఐసీసీ.. ఎటువంటి పెంపుదల చేయలేదు. ఓవరాల్‌ ప్రైజ్‌మనీ సుమారు 20 కోట్లు కాగా.. ఇతర ఏడు జట్లకు సైతం ఐసీసీ నగదు బహుమతి అందించనుంది. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ జూన్‌ 7-11న లండన్‌లోని ది ఓవల్‌ మైదానంలో జరుగనుంది. భారత్‌, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మక టెస్టు గద కోసం పోటీపడనున్నాయి. ఆరంగ్రేట డబ్ల్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్‌ అంతిమ సమరం కోసం భారత క్రికెటర్లు కొందరు ఇప్పటికే లండన్‌కు చేరుకుని సాధన మొదలెట్టారు!.

Spread the love