దోస్త్‌కు 14,259 మంది రిజిస్ట్రేషన్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్‌, బీకాం ఆనర్స్‌, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, బీసీఏ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)కు 14,259 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఉన్నత విద్యామండలి చైర్మెన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌ లింబాద్రి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు వచ్చేనెల 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు గడువున్నదని తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు https://dost.cgg.gov.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.

Spread the love