మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్

నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో, ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం మూడు గంట వరకు తెలంగాణలో 52.34శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో 55.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Spread the love