బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి

నవతెలంగాణ తమిళనాడు: తమిళనాడులో ఓ బాణా సంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. విరుద్ నగర్‌లో గల ఫ్యాక్టరీలో జరిగిన పేలుడుతో 9 మంది చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ మహిళ కూడా ఉన్నారు. సంఘటనా స్థలంలో ఏడుగురు చనిపోయారని, ఆస్పత్రికి తరలించిన తర్వాత మరో ఇద్దరు చనిపోయారని పోలీసులు వివరించారు. కెమికల్ మిక్సింగ్ గదిలో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. దర్యాప్తు తర్వాత ఘటనకు గల కారణం తెలుస్తుందని అంటున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రమాదం ధాటికి నాలుగు భవనాలు ధ్వంసం అయ్యాయి.

Spread the love