సీఎంపై కేటీఆర్ సంచలన ట్వీట్..

నవతెలంగాణ – హైదరాబాద్: గణతంత్ర దినోత్సవ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. సుమతి శతకంలో భాగంగా బద్దెన రాసిన పద్యం ‘కనకపు సింహసనమున శునకము గూర్చుండబెట్టిన శుభలగ్నమునం దొనగర బట్టము గట్టిన వెనుకటి గుణ మేలమాను? వినురా సుమతీ’ అనే పద్యాన్ని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ అంటూ కామెంట్స్ పెడుతుండగా మరికొంత మంది మాత్రం పదేళ్లు అధికారంలో కూర్చున్న మీకే ఈ పద్యం సరిపోతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్ లీడర్స్ కన్వెన్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీని వంద మీటర్ల గొయ్యి తీసి బొంద పెడతామని, కేసీఆర్ కాస్కో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Spread the love