సీఎం రేవంత్ రెడ్డి కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..

నవతెలంగాణ – హైదరాబాద్: దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావటం చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం ఇంట్లోనే.. ఈ నలుగురు ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. సీఎంను కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు ఉన్నారు. రాబోయే లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలోనే.. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావటం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు.. మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది.

Spread the love