రెండు సెషన్లుగా విభజన..
జనవరి 21 నుంచి మొదటి సెషన్ ప్రారంభం
న్యూఢిల్లీ : జేఈఈ మెయిన్ పరీక్షకు సన్నద్ధమవుతోన్న లక్షలాది మంది విద్యార్థులకు ఎన్టీఏ కీలక అప్డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 21 నుంచి 30 మధ్య తేదీల్లో జేఈఈ మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్ -2 పరీక్షలు నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలు జరిగే కచ్చితమైన తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు అధికారులు తెలిపారు. జేఈఈ మెయిన్ సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్లైన్ దరఖాస్తులు వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పేర్కొంది. సెషన్-2 పరీక్షకు జనవరి ఆఖరి వారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యేలా ఎగ్జామ్ సిటీల సంఖ్యను పెంచేందుకు కృషిచేస్తున్నామని.. వికలాంగ అభ్యర్థుల అవసరాలను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు పేర్కొంది.
ఈ డాక్యుమెంట్స్ అప్డేట్గా ఉన్నాయా?
జేఈఈ (మెయిన్) 2026 పరీక్షను సజావుగా నిర్వహించడంలో భాగంగా అర్హత కలిగిన అభ్యర్థులంతా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకొనే ముందే అవసరమైన డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలని ఎన్టీఏ ఇటీవల కోరిన విషయం తెలిసిందే. తద్వారా దరఖాస్తుల ప్రక్రియ, తదుపరి దశల్లో ఎదురయ్యే ఇబ్బందులు తప్పుతాయని, దరఖాస్తుల తిరస్కరణ, తదితర సమస్యలు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది.
ఆధార్ : ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ (పదో తరగతి సర్టిఫికెట్ ప్రకారం) సరిగా ఉండేలా అప్డేట్ చేసుకోండి. అలాగే, తాజా ఫొటోగ్రాఫ్, ఇంటి అడ్రస్, తండ్రి పేరు మీ కార్డులో అప్డేట్ అయి ఉండాలి.
వికలాంగ అభ్యర్థులైతే.. : యూడీఐడీ కార్డు చెల్లుబాటవుతుంది. అయితే, రెన్యువల్ చేయించుకొని అప్డేట్గా ఉండటం తప్పనిసరి.
కేటగిరీ సర్టిఫికెట్ : కేటగిరీ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్/ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్సీఎల్)ను చెల్లుబాటయ్యేలా అప్డేట్ చేసుకోవాలి.
అలాగే, అభ్యర్థులు ఎప్పటికప్పుడు www.nta.ac.in, https://jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ డైరెక్టర్ (పరీక్షలు) ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తద్వారా జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన నోటీసులు, ఇతర అప్డేట్స్ తెలుసుకోవచ్చన్నారు.
జేఈఈ మెయిన్-2026 పరీక్షల షెడ్యూల్ విడుదల
- Advertisement -
- Advertisement -